4000 పంచాయతీల్లో తాటి, ఈత మొక్కలు నాటాలి: శ్రీనివాస్‌గౌడ్‌

ABN , First Publish Date - 2020-07-05T07:10:37+05:30 IST

ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 4000 గ్రామ పంచాయతీల పరిధిలో తాటి, ఈత, ఖర్జూర మొక్కలను

4000 పంచాయతీల్లో తాటి, ఈత మొక్కలు నాటాలి: శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌/మహబూబ్‌నగర్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 4000 గ్రామ పంచాయతీల పరిధిలో తాటి, ఈత, ఖర్జూర మొక్కలను నాటాలని ఆ శాఖ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ అధికారులను ఆదేశించారు. ఒక్కో గ్రామ పంచాయతీల పరిధిలో 1000 చొప్పున మొక్కలను నాటాలన్నారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఆరో విడత హరితహారం కార్యక్రమంపై శనివారం మంత్రి సమీక్ష నిర్వహించారు. చెరువులు, కుంటలు, కాలువలు, నాలాలు, ప్రభుత్వ భూములలో మొక్కలు నాటాలని సూచించారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలోనూ మంత్రి మాట్లాడుతూ.. ఆరేళ్ల తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి వల్లే ప్రతిపక్షాలు ఖాళీ అవుతున్నాయని అన్నారు. బీజేపీ, టీడీపీలకు చెందిన పలువురు నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. 

Updated Date - 2020-07-05T07:10:37+05:30 IST