స్కందగిరి ఆలయం మహా కుంభాభిషేకంలో పాల్గొన్న మంత్రి తలసాని

ABN , First Publish Date - 2022-04-21T22:25:03+05:30 IST

సికింద్రాబాద్ లోని శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో గురువారం నిర్వహించిన స్వర్ణ బంధన మహా కుంభాభిషేకం లో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

స్కందగిరి ఆలయం మహా కుంభాభిషేకంలో పాల్గొన్న మంత్రి తలసాని

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో గురువారం నిర్వహించిన స్వర్ణ బంధన మహా కుంభాభిషేకం లో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్న అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి తో పాటు పద్మారావు నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-04-21T22:25:03+05:30 IST