హాస్టళ్ల నిర్వాహకులతో మంత్రి తలసాని భేటీ

ABN , First Publish Date - 2020-03-26T18:34:46+05:30 IST

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాస్టళ్ల నిర్వాహకులతో గురువారం భేటీ అయ్యారు.

హాస్టళ్ల నిర్వాహకులతో మంత్రి తలసాని భేటీ

హైదరాబాద్: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాస్టళ్ల నిర్వాహకులతో గురువారం భేటీ అయ్యారు. హాస్టళ్లో ఉంటున్న విద్యార్థులను ఖాళీ చేయించొద్దని అన్నారు. హాస్టళ్లకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తామని చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హాస్టళ్ల నిర్వాహకులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి తలసాని సూచించారు.

Updated Date - 2020-03-26T18:34:46+05:30 IST