శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్న మంత్రి తలసాని

ABN , First Publish Date - 2022-04-10T22:20:19+05:30 IST

శ్రీరామ నవమిసందర్భంగా జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో జరిగిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాల్లో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్న మంత్రి తలసాని

హైదరాబాద్: శ్రీరామ నవమిసందర్భంగా జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో జరిగిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాల్లో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సనత్ నగర్ లోని హనుమాన్ దేవాలయం, పూల్ బాగ్ హనుమాన్ టెంపుల్, బేగంపేట లోని కేసరి హనుమాన్ తదితర దేవాలయాల్లో జరిగిన కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.స్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం ఆయా ఆలయ కమిటీలు మంత్రిని సన్మానించాయి. 

Updated Date - 2022-04-10T22:20:19+05:30 IST