పద్మశ్రీ కనకరాజు ను అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABN , First Publish Date - 2021-01-28T01:28:24+05:30 IST

రాజ్ గోండు గిరిజనుల ప్రత్యేక నాట్య కళ గుస్సాడీ లో అపార నైపుణ్యం గడించిన గుస్సాడీ రాజు కనకరాజు సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం

పద్మశ్రీ కనకరాజు ను అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: రాజ్ గోండు గిరిజనుల ప్రత్యేక నాట్య కళ గుస్సాడీ లో అపార నైపుణ్యం గడించిన గుస్సాడీ రాజు కనకరాజు సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన అనంతరం బుధవారం పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ తో  రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదివాసీ గుడేల్లో మాత్రమే కనిపించే గుస్సాడీ నృత్యం ఒక విశిష్టమైన కళ అని మంత్రి అభివర్ణించారు. 


ఆదివాసీ నృత్యం గుస్సాడీ ని కొత్త తరానికి అందిస్తున్న కనకరాజు సేవలను గుర్తించి పద్మ శ్రీ పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాచీన నృత్యం పై మైదాన ప్రాంతాల్లో ని వారికి అవగాహన తక్కువ అన్నారు. వందల ఏళ్ల నుంచి ఈ ప్రాచీన దేవతా కళ తరతరాలు దాటుకుంటూ ప్రస్తుత రోబోటిక్ యుగంలోనూ కోనసాగుతోందన్నారు. గుస్సాడీ నాట్యానికి మెరుగులు దిద్దటమే కాకుండా నేటి తరానికి శిక్షణ ఇస్తూ మరింత గొప్ప కళ గా తీర్చిదిద్దుతున్న కనకరాజును మంత్రి  శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా అభినందించి, ఘనంగా సన్మానించారు.


పద్మ శ్రీ పురస్కారం పొందిన  కనకరాజు సేవలకు గుర్తుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున 10 వేల రూపాయల ప్రత్యేక పెన్షన్ ను అందించేందుకు ముఖ్యమంత్రి  చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్లి అమలు చేస్తామన్నారు. కనకరాజు తో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన 12 మెట్ల కిన్నెర విద్వాంసులు, దర్శనం మొగిలయ్య కు త్వరలోనే పెన్షన్లు అందిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Updated Date - 2021-01-28T01:28:24+05:30 IST