ఆన్లైన్ టికెటింగ్ యాప్స్ యాజమాన్యాలతో పేర్ని నాని సమావేశం
ABN , First Publish Date - 2021-11-26T15:55:49+05:30 IST
బుక్ మై షో, జస్ట్ బుకింగ్, పేటీఎం వంటి సినిమా టికెట్లు అమ్మే వెబ్సైట్, యాప్ యాజమాన్యాలతో మంత్రి పేర్ని నాని మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సమావేశం కానున్నారు.
అమరావతి : బుక్ మై షో, జస్ట్ బుకింగ్, పేటీఎం వంటి సినిమా టికెట్లు అమ్మే వెబ్సైట్, యాప్ యాజమాన్యాలతో మంత్రి పేర్ని నాని మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఆన్లైన్ టికెట్ల వ్యవహరంలో సినిమా హళ్ళతో టికెటింగ్ యాప్స్ యాజమాన్యాలు ఒప్పందం చేసుకున్నాయి. ప్రభుత్వ ఆన్లైన్ టికెట్ంగ్కు ప్రైవేటు టికెటింగ్ యాప్ కంపెనీలు ప్రధాన అవరోధం కానున్నాయి. దీంతో వారితో చర్చలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.