ఉద్యోగుల ఇష్యూకు ముగింపు పలుకుతాం: మంత్రి Perni nani
ABN , First Publish Date - 2022-02-05T17:09:56+05:30 IST
నేటితో ఉద్యోగుల సమస్య పరిష్కారం అవుతుందని మంత్రి పేర్నినాని అన్నారు.
అమరావతి: నేటితో ఉద్యోగుల సమస్య పరిష్కారం అవుతుందని మంత్రి పేర్నినాని అన్నారు. నిన్న ఉద్యోగుల డిమాండ్స్పై చర్చించామని, పీఆర్సీ అంశంపై ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దేందుకు మంత్రుల కమిటీ ప్రయత్నం చేసిందని తెలిపారు. అనుమానాల నివృత్తితో పాటు కొన్ని సర్దుబాటు చేశామన్నారు. చాలా అంశాల్లో ఉద్యోగ సంఘాలు అంగీకారానికి వచ్చాయని భావిస్తున్నామని తెలిపారు. మళ్ళీ కలిసి పని చేస్తామని చెప్పారు. ఫిట్మెంట్, ఐఆర్ రికవరీ, హెచ్ఆర్ఏ అంశాలతో పాటు చాలా అంశాలు మాట్లాడామన్నారు. ఇవాళ మరోమారు చర్చలు జరిపి ఇష్యూకి ముగింపు పలుకుతామని మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు.