రైతుల ప్రయోజనాలను కాపాడుతున్నది టీఆర్ఎస్ మాత్రమే

ABN , First Publish Date - 2021-11-22T22:05:25+05:30 IST

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే రైతుల ప్రయోజనాలు కాపాడుతున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు

రైతుల ప్రయోజనాలను కాపాడుతున్నది టీఆర్ఎస్ మాత్రమే

హైద‌రాబాద్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే రైతుల ప్రయోజనాలు కాపాడుతున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని, సమయం వచ్చినప్పుడల్లా కేంద్రంతో పోరాడుతున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 


సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతుల‌ను ప‌ట్టించుకోలేద‌న్న వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ఖండించారు. మూడేండ్ల‌లో రూ. 3,384.95 కోట్ల రైతు బీమా ప‌రిహారం అందించామ‌ని తెలిపారు. 67,699 మంది రైతుల కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున అందించామ‌న్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంట‌ల నాణ్య‌మైన క‌రెంట్ వంటి ప‌థ‌కాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమ‌ల‌వుతున్నాయా? అని ప్ర‌శ్నించారు. ఏడాదికి రూ. 60 వేల కోట్లు వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల‌కు ఖ‌ర్చు చేస్తున్నాం. సీఎం కేసీఆర్ రైతు ప‌క్ష‌పాతి అని మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Updated Date - 2021-11-22T22:05:25+05:30 IST