యాసంగి పంట కోనుగోలుకు కేంద్రాన్ని ఒప్పించాలి
ABN , First Publish Date - 2021-10-28T22:14:52+05:30 IST
యాసంగి పంట కొనుగోలుచేస్తామని కేంద్రాన్ని ఒప్పించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రాష్ట్ర బిజెపి నేతలకు సవాల్ విసిరారు.
హైదరాబాద్: యాసంగి పంట కొనుగోలుచేస్తామని కేంద్రాన్ని ఒప్పించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రాష్ట్ర బిజెపి నేతలకు సవాల్ విసిరారు. నిజంగా రాష్ట్ర బిజెపి నాయకులకు రైతుల పట్ల ప్రేమ ఉంటే, నిజంగా వారు మొనగాళ్లే అయితే తన సవాల్ను వారు స్వీకరించాలని అన్నారు. కేంద్రం ఒప్పుకునే వరకూ దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రానికి కేంద్రం నుంచి ప్రకటన తెప్పిస్తే తాను తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేక పోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్లు తమ పదవులకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకూ బీజెపి నాయకులు దొంగ దీక్షలు చేస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.