ఎల్లుండి ఖమ్మం ఐటీ టవర్ ప్రారంభోత్సవం: కేటీఆర్
ABN , First Publish Date - 2020-12-05T20:54:14+05:30 IST
సోమవారం ఖమ్మం ఐటీ టవర్ ప్రారంభోత్సవం చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఐటీ, పరిశ్రమల శాఖలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు
హైదరాబాద్: సోమవారం ఖమ్మం ఐటీ టవర్ ప్రారంభోత్సవం చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఐటీ, పరిశ్రమల శాఖలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఐటీ పరిశ్రమలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వేగంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని ఇతర ప్రాంతాలతో పాటు ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమ విస్తరింపజేస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలో కొంపల్లిలో ఐటీ పార్క్కి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. అలాగే ఐటీ కంపెనీలు వరంగల్కు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో మెరుగైన స్థానం కోసం కృషి చేస్తామని కేటీఆర్ చెప్పుకొచ్చారు.