మంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-04-18T22:14:33+05:30 IST
డిప్యూటీ సీఎం, మంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: డిప్యూటీ సీఎం, మంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ దేవాదాయశాఖలో అవినీతిపై స్పందించారు. దేవాదాయ శాఖలో అవినీతి జరుగుతుందనడం వాస్తవమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై అవినీతి జరగకుండా కట్టడిచేస్తానని స్పష్టం చేశారు. ఆలయాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఒకేసారి వీఐపీలను పక్కనపెట్టడం సాధ్యం కాదన్నారు. ఏళ్లుగా పాతుకుపోయిన ఉద్యోగులను మార్చే ప్రయత్నం చేస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.