ఎస్సీలకు రుణసాయానికి ప్రణాళిక అమలు చేయండి: కొప్పుల

ABN , First Publish Date - 2021-11-06T22:32:29+05:30 IST

రాష్ట్రంలో ఎస్సీలకు రుణ సహాయానికి సంబంధించిన 2020-21 సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళిక అమలును మరింత వేగవంతం చేయాలని మైనారిటీ శాఖ మంత్రి కొప్పులఈశ్వర్ అధికారులను ఆదేశించారు.

ఎస్సీలకు రుణసాయానికి ప్రణాళిక అమలు చేయండి: కొప్పుల

హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీలకు రుణ సహాయానికి సంబంధించిన 2020-21 సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళిక అమలును మరింత వేగవంతం చేయాలని మైనారిటీ శాఖ మంత్రి కొప్పులఈశ్వర్ అధికారులను ఆదేశించారు. గతేడాదికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అమలు,ఈ ఆర్థిక సంవత్సరంలో రూపొందించాల్సిన ప్రణాళిక గురించి అధికారులతో మంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ వృత్తి నైపుణ్యత లేని వాటిని ఈ నెలాఖరులోగా, వృత్తి నైపుణ్యానికి సంబంధించిన రుణాలను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని అన్నారు.ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలో ఏ యే అంశాలు చేర్చాలో వెంటనే ఖరారు చేయాలనికూడా మంత్రి ఆదేశించారు.


ఈ నెలాఖరులో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరపాలని సమావేశంలో నిర్ణయించారు. దళితుల సంక్షేమం,ఉన్నతి,రుణ ప్రణాళిక అమలు, ఉపకార వేతనాలు,వసతి గృహాల నిర్వహణ,స్టడీ సర్కిళ్లను మరింత ఉన్నతంగా తీర్చి దిద్దడం,వచ్చే బ్యాంకర్ల సమావేశంలో ఎస్సీల సముద్ధరణకు సంబంధించిన అంశాలను చేర్చడం తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చించనున్నట్టు మంత్రి చెప్పారు.మంత్రి అసెంబ్లీ నియోజకవర్గం ధర్మపురిలో ఎస్సీ స్టడీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఎస్సీ కులాల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు.యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు గాను ఆ యా వృత్తులలో శిక్షణా కార్యక్రమాలను వెంటనే చేపట్టాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు.

Updated Date - 2021-11-06T22:32:29+05:30 IST