మంత్రి కొప్పుల ఈశ్వర్ వద్ద పని చేసే వ్యక్తికి కరోనా
ABN , First Publish Date - 2020-07-06T02:56:24+05:30 IST
సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వద్ద ఔట్ సోర్సింగ్ కింద కంప్యూటర్ ఆపరేటర్గా ప...
హైదరాబాద్: సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వద్ద ఔట్ సోర్సింగ్ కింద కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్న కుమార్కు కరోనా సోకింది. జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కుమార్కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మంత్రి కొప్పుల పీఏలు, సిబ్బందిని హోం క్వారంటైన్కు తరలించారు. హోం మంత్రి మహమూద్ అలీ పీఏ, సిబ్బంది ఉంటున్న క్వార్టర్ పక్క క్వార్టర్లో కుమార్ ఉంటున్నట్లు తెలిసింది.