ముంపు రైతుల్ని ఆదుకుంటాం: మంత్రి జగదీష్రెడ్డి
ABN , First Publish Date - 2020-10-02T02:08:00+05:30 IST
వరదల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. చింతలపాలెం మండలం
సూర్యాపేట: వరదల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి జగదీష్ రెడ్డి హామీ ఇచ్చారు. చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్ట్ వరద తాకిడికి నష్టపోయిన బుగ్గమాధారం, వజినేపల్లి ముంపు ప్రాంతాన్ని మంత్రి జగదీష్రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మంత్రి మాట్లాడారు. పులిచింతలకు భారీ మొత్తంలో వరదలు రావడం వల్ల ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాలు ఏటా ముంపునకు గురై రైతులు నష్టపోతున్నారని మంత్రి తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు దిగువన మూలమలుపు ఉండటం వల్ల వరద నీరు గ్రామాల్లోకి వచ్చి ముంపునకు గురవుతున్నాయని చెప్పారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.