యాదాద్రీశుడిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ABN , First Publish Date - 2022-01-21T19:58:53+05:30 IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని శుక్రవారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు.

యాదాద్రీశుడిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

యాదాద్రి భువనగిరి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని శుక్రవారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగాఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి.. శేషవస్త్రంతో సత్కరించారు.అనంతరం ఆలయ అభివృద్ధి పనులను, ప్రసాద తయారీ, విక్రయ కేంద్రాలను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత రెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆలయ ఈవో గీతా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T19:58:53+05:30 IST