అన్యాక్రాంతమైన భూముల సేకరణకు స్పెషల్ డ్రైవ్: ఇంద్రకరణ్ రెడ్డి
ABN , First Publish Date - 2021-09-12T01:20:42+05:30 IST
తెలంగాణలో అన్యాక్రాంతమైన దేవాలయాల భూములను తిరిగి సేకరించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణలో అన్యాక్రాంతమైన దేవాలయాల భూములను తిరిగి సేకరించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు స్పెషల్ డ్రైవ్ ద్వారా అన్యాక్రాంతమైన 2, 622 ఎకరాల దేవదాయ శాఖ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇందులో మహబూబ్ నగర్ జిల్లాలో 1040 ఎకరాలు, నల్గొండ జిల్లాలో 502 ఎకరాలు, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో 200 ఎకరాలకు పైగా ఆలయ భూములను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధికారులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఇతర జిల్లాల అధికారులు కూడా మరింత ఉత్సాహంతో పని చేయాలన్నారు.