ధాన్యం సేకరణ స్థితిగతులపై మంత్రి హరీశ్ రావు సమావేశం
ABN , First Publish Date - 2022-06-24T22:16:11+05:30 IST
తెలంగాణలో ధాన్యం సేకరణ స్ధితిగతులపై ఆర్ధిక మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం జరిగింది.
హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం సేకరణ స్ధితిగతులపై ఆర్ధిక మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్, తెలంగాణ రైతుబంధు ఛైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు ధాన్యంసేకరణకు సంబంధించి ఉన్నతాధికారులు సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. సేకరణకు సంబంధించి ఇతర అంశాలనుకూడా వెంటనే అందజేయాలన్నారు.ధాన్యం సేకరణ పరిస్థితులపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.