హనుమకొండలో మంత్రి హరీష్‌రావు పర్యటన

ABN , First Publish Date - 2022-02-10T16:27:59+05:30 IST

జిల్లాలో మంత్రి హరీష్‌ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రి, ఎంజీఎంను మంత్రి సందర్శించారు.

హనుమకొండలో మంత్రి హరీష్‌రావు పర్యటన

హనుమకొండ: జిల్లాలో మంత్రి హరీష్‌ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రి, ఎంజీఎంను మంత్రి సందర్శించారు. మెటర్నిటీ ఆస్పత్రి ఆవరణలో టీ డయగ్నోస్టిక్ హబ్, రేడియాలజీ విభాగాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే బ్లడ్ బ్యాంక్ స్టోరేజ్ యూనిట్, టీబీ స్పెషాలిటీ క్లినిక్‌ను ప్రారంభించారు. ఎంజీఎంలో వివిధ వార్డులను పరిశీలించిన అనంతరం పిడియాట్రిక్ ఐసీయూను మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. మంత్రి హరీష్‌రావుతో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్‌ ఉన్నారు. 


Updated Date - 2022-02-10T16:27:59+05:30 IST