బడ్జెట్ కు ముందు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హరీశ్ రావు
ABN , First Publish Date - 2022-03-07T22:36:31+05:30 IST
శాసన సభలో 2022-23 బడ్జెట్ సమావేశాల సందర్భంగా... అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశ పెట్టిన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు
హైదరాబాద్: శాసన సభలో 2022-23 బడ్జెట్ సమావేశాల సందర్భంగా... అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశ పెట్టిన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు హరీశ్ రావుకి శుభాకాంక్షలు తెలిపారు. సిఎం కేసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా అభివృద్ధి చెందుతున్నదని, సంక్షేమంలో అగ్రగామిగా ఉందని, రాష్ట్రం బంగారు తెలంగాణ మారుతున్నదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఈ నేపథ్యంలో వరసగా మూడోసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతున్న హరీశ్ రావుకి మంత్రి దయాకర్ రావు శుభాభినందనలు తెలిపారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పది కాలాల పాటు చల్లగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమాలను అందించాలని భగవండుడిని కోరుకున్నట్టు ఇద్దరు మంత్రులు తెలిపారు.