ధర్మ పరిరక్షకులు సీఎం కేసీఆర్: Gangula

ABN , First Publish Date - 2022-05-28T20:33:20+05:30 IST

ధర్మ పరిరక్షణకు సీఎం కేసీఆర్(kcr) ఎంతో శ్రద్ధతో పని చేస్తున్నారని బిసి,పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Gangula kamalakar)అన్నారు

ధర్మ పరిరక్షకులు సీఎం కేసీఆర్: Gangula

కరీంనగర్: ధర్మ పరిరక్షణకు సీఎం కేసీఆర్(kcr) ఎంతో శ్రద్ధతో పని చేస్తున్నారని బిసి,పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Gangula kamalakar)అన్నారు.తెలంగాణలో వైభవోపేతంగా ఆలయాలను తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ న భూతో న భవిష్యత్ లా యాదాద్రి నిర్మాణం పూర్తిచేశారని అన్నారు. అలాగే త్వరలో కరీంనగర్లో టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరగనుందని ఈసందర్భంగా మంత్రి తెలిపారు.నగరం మద్యలో అత్యంత విలువైన పదెకరాలను ప్రభుత్వం కేటాయించినట్టు తెలిపారు. గతంలోనే ఇక్కడ ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు(ttd board) ఆమోదించిందని తెలిపారు. 


కరీంనగర్ లో టీటీడీ గుడి నిర్మాణం కోసం ఆలయాలను పరిశీలిస్తున్నట్టు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బి.వినోద్ కుమార్,ఎంపీ దీవకొండ దామోదర్ రావు, టీటీడీ తెలంగాణ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ జి.వి బాస్కర్ రావులతో కలిసి ఆలయ నిర్మాణం కోసం పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు టీటీడీ ఆలయ పరిశీలించనున్నట్టు తెలిపారు.ఈ మేరకు గుంటూరు జిల్లా మంగళగిరి, వెంకటపాలెం వేంకటేశ్వర స్వామి గుడి సందర్శనకు ప్రతినిధుల బృందంతో బయలు దేరినట్టు తెలిపారు.

Updated Date - 2022-05-28T20:33:20+05:30 IST