ప్లీనరీ వేదిక పై మంత్రి ఎర్రబెల్లి కి సీఎం కేసిఆర్ ప్రశంసలు

ABN , First Publish Date - 2022-04-28T23:35:52+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆరెఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం జరిగిన ప్లీనరీ వేదిక పై నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని, ఆయన నిర్వహిస్తున్న శాఖపై ప్రశంసల జల్లు కురిపించారు.

ప్లీనరీ వేదిక పై మంత్రి ఎర్రబెల్లి కి  సీఎం కేసిఆర్ ప్రశంసలు

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆరెఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం జరిగిన  ప్లీనరీ వేదిక పై నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని, ఆయన నిర్వహిస్తున్న శాఖపై ప్రశంసల జల్లు కురిపించారు. అవార్డుల మీద అవార్డులు వస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కు అభినందనలు చెప్పారు. కేసిఆర్ మాట్లాడితెనో, దయాకర్ రావు చేతులు ఊపితెనో అవార్డులు రాలేదంటూ చలోక్తులతో చమత్కరించారు. అవార్డులు ఊరికే రావు. ఒల్లు వంచాలే. మెదడును కరగదీయాలే అంటూ హితోక్తులు విసిరారు.


రాష్ట్రానికి కేంద్ర అవార్డుల పంట వెనుక కృషి చిత్తశుద్ధి ఉన్నాయంటూ సీఎం వివరించారు.కాగా,సీఎం కేసిఆర్ మేధోమథనం, పట్టుదల, నిరంతర కృషి వల్లే అవార్డులు వస్తున్నాయంటూ మంత్రి ఎర్రబెల్లి సీఎంకు ధన్యవాదాలుతెలిపారు. అవార్డులు రావడానికి కృషి చేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు.

Updated Date - 2022-04-28T23:35:52+05:30 IST