కోవిడ్ నుంచి కోలుకున్న మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-01-05T20:04:12+05:30 IST

రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గత కొన్ని రోజులుగా కోవిడ్ సోకి చికిత్స తీసుకున్నారు.

కోవిడ్ నుంచి కోలుకున్న మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్: రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గత కొన్ని రోజులుగా కోవిడ్ సోకి చికిత్స తీసుకున్నారు. పూర్తిగా కోలుకున్నమంత్రి బుధవారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి  శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరు రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి,  నన్నపనేని నరేందర్ తదితరులతో కలిసి మంత్రి కేటీఆర్ ని కలిసి నూతన సంవత్సర శుభాకంక్షలు తెలిపారు. 


సీఎం కేసిఆర్ నిర్దేశంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నతమైన స్థానానికి చేరాలని కోరుకున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని  అన్నారు. ఇటీవల బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా దేశంలో నెంబర్ వన్ గా తెలంగాణ నిలవడం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని మంత్రి కేటీఆర్ అభినందించారు.

Updated Date - 2022-01-05T20:04:12+05:30 IST