తండాలను గ్రామ పంచాయితీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-02-26T22:32:40+05:30 IST

తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలనను చేర్చిన ఏకైక ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పంచాయతీరాజ్, గ్రామీణ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.శ

తండాలను గ్రామ పంచాయితీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే: ఎర్రబెల్లి

మహబూబాబాద్: తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలనను చేర్చిన ఏకైక ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పంచాయతీరాజ్, గ్రామీణ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.శనివారం మధ్యాహ్నం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని బంజారా నగర్ దుబ్బ తండాలో 5వార్డ్ కౌన్సిలర్ సునీత జెసింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 283 జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత పండుగలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని, 3వేల తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకున్నామని, ప్రతి సంవత్సరానికి 5 లక్షల చొప్పున తండాల అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందని, బంజారాల అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు భూ కేటాయింపు చేయడం జరిగిందని రానున్న రోజుల్లో గుడి నిర్మాణం చేసుకోవాలని సంబంధించిన నిధులు మంజూరు చేస్తానని  మంత్రి తెలిపారు.


సంత్ సేవాలాల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో జన్మించాడని, బ్రహ్మచారి గా ఉండి జాతి కోసం అహర్నిశలు గా సేవలందించి మహోన్నతుడు అయ్యాడని సేవాలాల్ మహారాజ్ అని మంత్రి కొనియాడారు. ఆయన చేసిన సేవలను గుర్తించి దైవంగా ఆయన పండుగను  అధికారికంగా జరుపుకుంటున్నామని అన్నారు. మన వస్త్రాల వేషధారణ మన గుర్తింపు అని, అడవుల్లో జీవనం వలన క్రూర మృగాల నుండి రక్షించుటకై పూర్వం నుండి అద్దాలు ఉన్న వష్త్రాలు చేతికి నిండుగా గాజులు ధరించుట సాంప్రదాయంగా మారిందని సేవాలాల్ సేవలను ఆచరిస్తూ భవిష్యత్తు తరాలకు ఆయన చేసిన మంచి పనులను సమాజంలో నిలపాలని మంత్రి అన్నారు. 


బంజారాలoటేనే మంచికి మారుపేరు అని మాటిస్తే తప్పని వారని, నా గెలుపుకు ప్రతి సారి మీరు ఆశీర్వదించడం వల్లనే మంత్రి మీ ముందుకు వచ్చానని సేవాలాల్ తో పాటు మీ ఆశీర్వాదం కూడా ఉండాలని మంత్రి అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేష్ బాబు, ఎంపీపీలు చిన్న అంజయ్య, ఈదురు రాజేశ్వరి, జడ్పిటిసి లు శ్రీనివాస్, సత్యవతి, జోతిర్మయి, మున్సిపల్ చైర్ పర్సన్ రామచంద్రయ్య, మాజీ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ గాంధీ నాయక్,  మార్కెట్ కమిటీ చైర్మన్ శాంత, ఎంపీడీవో కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, సేవాలాల్ ఉత్సవ కమిటీ సభ్యులు ,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-26T22:32:40+05:30 IST