రాష్ట్రంలో 27వేల ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాం

ABN , First Publish Date - 2022-02-25T20:34:56+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ఆశావర్కర్ల సేవలను మరింతగా సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 27వేల మంది ఆశావర్కర్లకు 4జీసిమ్, స్మార్ట్ ఫోన్ లను అందిస్తున్నామని పంచాయితీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

రాష్ట్రంలో 27వేల ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాం

వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా ఆశావర్కర్ల సేవలను మరింతగా సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 27వేల మంది ఆశావర్కర్లకు 4జీసిమ్, స్మార్ట్ ఫోన్ లను అందిస్తున్నామని పంచాయితీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. శుక్రవారం ఆయన వరంగల్, హన్మకొండ జిల్లాల పరిధిలోని ఆశ వర్కర్లకు స్మార్ట్ ఫోన్ లను పంపిణీ చేశారు వరంగల్ లోని 693 మంది, హనుమకొండలోని 616 మంది ఆశ వర్కర్లకు మంత్రి స్మార్ట్ఫోన్లను హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ స్మార్ట్ ఫోన్ లను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో27 వేల ఆశా కార్యకర్తలకు 4జి సిమ్, స్మార్ట్ ఫోన్ అందిస్తున్నామని తెలిపారు.

 

ఆశా వర్కర్లు టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.గతంలో ఆశావర్కర్లు జీతం కోసం  పోరాటాలు చేస్తే నాటి ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించాయని గుర్తు చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆశాల మనసు తెల్సుకుని జీతాలను రు. 9750 కి పెంచారు.తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 15 వందలు మాత్రమే ఉంటే ఇప్పుడు ఆశాల జీతం 9 వేల 750 కి చేరింది.ఏడు ఏళ్లలో ఎంత పెరిగిందో (8 వేల 250 పెరిగింది) ఆలోచించాలి.ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో ఆశా వర్కర్లకు ఇచ్చేది కేవలం 4వేలు అయితే మన దగ్గర ఇస్తున్నది 9వేల 750.మరో బీజీపీ రాష్ట్రం మధ్య ప్రదేశ్ లో ఇస్తున్నది కేవలం 3 వేలు.కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లో ఇస్తున్నది కేవలం 3 వేలు మాత్రమేనని అన్నారు.గతంలో మూడు నెలలకు ఒక్కసారి జీతాలు వచ్చేది గగనం. 


కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తారీకు జీతాలు ఇస్తున్నది. ముఖ్యమంత్రి మనసున్న మహా మనిషి,పని తీరుతో ముఖ్యమంత్రి మనసు గెలుచుకోవాలని అన్నారు.ఆరోగ్య కార్యక్రమాలు విజయవంతం కావడంతో ఆశాలది కీలక పాత్ర.బాగా పని చేస్తున్నారు.. ఫీవర్ సర్వేతో కరోనా కట్టడి చేశారని ప్రశంసించారు.వరంగల్, హన్మకొండలోవ్యాక్సినేషన్ బాగా చేశారు.వంద శాతం పూర్తి చేసి మంచి పేరు తెచ్చారు.ఇంకా...గర్భిణీ సంక్షేమం పై మరింత దృష్టి పెట్టాలి.ప్రజల ఆరోగ్యం ఆశా వర్కర్లు... మీ అందరి చేతుల్లోనే ఉంది.ప్రభుత్వ దవాఖానల్లో కానుపులు పెరగాలి.దీర్ఘ కాలిక వ్యాధి గ్రస్తులకు త్వరలో ఎన్ సి డి (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) కిట్లు అందజేస్తాము.ప్రజారోగ్యం లో తెలంగాణ దేశంలో 3 వ స్థానంలో ఉందని తెలిపారు. మోడీ, యోగి ప్రాతినిధ్యం వహించే ఉత్తర ప్రదేశ్ చివరి స్థానంలో ఉంది.మనం మూడు నుండి మొదటి స్థానంలోకి వెళ్లేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్,వరంగల్ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఎం పీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, రెండు జిల్లాల కలెక్టర్లు గోపి, రాజీవ్ గాంధీ హనుమంతు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-25T20:34:56+05:30 IST