రామానుజుల వారి దృక్పథమే ప్రపంచానికి ఏకైక దారి: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-02-12T21:17:09+05:30 IST

ముచ్చింతల్ లోని జీయర్ ట్రస్ట్ లో 1035 హోమగుండాల శ్రీలక్ష్మీ నారాయణ మహా క్రతువు, గోపాలోపాయన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది.

రామానుజుల వారి దృక్పథమే ప్రపంచానికి ఏకైక దారి: మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్:ముచ్చింతల్ లోని జీయర్ ట్రస్ట్ లో 1035 హోమగుండాల శ్రీలక్ష్మీ నారాయణ మహా క్రతువు, గోపాలోపాయన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ సమాన అవకాశాలు కలిగి, అందరిలోనూ సమ భావన కలిగి ఉన్నప్పుడే సమాజంలో ప్రజలకు సుఖ శాంతులు,సంతోషాలు కలుగుతాయని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా100 ఏళ్ల క్రితమే ప్రపంచానికి సమత ను చాటిన రామానుజుల వారి భారీ విగ్రహాన్ని మూచ్చింతల్ లో ప్రతిష్ఠించి, లోకానికి అంతా సమానం అనే విషయాన్ని చాటుతున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, అందుకు తోడుగా నిలిచిన మై హోమ్స్ అధినేత రామేశ్వర్ రావు గార్లు చరిత్రలో నిలిచి పోతారని మంత్రి అన్నారు.


ఎప్పటికైనా రామానుజుల వారి దృక్పథమే ప్రపంచానికి ఏకైక దారి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి పూర్ణాహుతి సంకల్పం తీసుకుని, స్వామి వారిని దర్శించుకున్నారు.అలాగే 1035 హోమగుండాల శ్రీ లక్ష్మీ నారాయణ మహా క్రతువులో పాల్గొన్నారు. జీయర్ స్వామి వారి గురువు గోపాలాచర్యుల వారి పేరున ఇచ్చే గోపాలోపాయన పురస్కార ప్రదానోత్సవం లో మంత్రి, తన సతీమణి, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు, కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్నారు. గోపాలోపాయన పురస్కారాన్ని తమిళనాడుకు చెందిన మాడభూషి వరద రాజన్ కి అందచేశారు.


ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ, దేవుడు అందరినీ సమానంగానే సృష్టించాడని, వారి వారి తెలివి, అవకాశాలను బట్టి ఎదుగుతున్నారు. కానీ అంతా సమానమేనని అన్నారు.సమతా మూర్తి విగ్రహ ప్రతిష్ఠ, రాష్ట్ర ప్రతిష్ఠను మరింత పెంచిందని, ప్రపంచ భక్తి పటంలో అంతర్జాతీయ సమతా క్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా ముచ్చింతల నిలిచిపోయిందని అన్నారు. 


Updated Date - 2022-02-12T21:17:09+05:30 IST