తెలంగాణ వచ్చాక పల్లెల రూపురేఖలు మారిపోయాయి

ABN , First Publish Date - 2022-01-10T23:03:32+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పల్లెల రూపు రేఖలు మారిపోయాయని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

తెలంగాణ వచ్చాక పల్లెల రూపురేఖలు మారిపోయాయి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పల్లెల రూపు రేఖలు మారిపోయాయని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప‌ల్లె ప్ర‌గ‌తి ప‌థ‌కం సాధించిన ప్ర‌గ‌తినంతా క‌వి, ర‌చ‌యిత‌, తెలంగాణ సాహిత్య అకాడ‌మీ చైర్మ‌న్ జూలూరు గౌరీశంక‌ర్ త‌న పచ్చా ప‌చ్చ‌ని ప‌ల్లె అనే గ్రంథంలో నిక్షిప్తం చేశార‌ని ఆయన కొనియాడారు.గౌరీ శంక‌ర్ సోమ‌వారం మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసి త‌న ప‌చ్చా ప‌చ్చ‌ని ప‌ల్లె పుస్త‌కాన్ని అంద‌చేశారు. 


ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి కేసిఆర్ దార్శనిక ఆలోచ‌న‌ల‌న్నీ ఈ గ్రంథంలో ఉన్నాయ‌న్నారు. గ్రామీణ భార‌త చ‌రిత్ర‌లో మ‌న ప‌ల్లెలు ఊహించ‌ని విధంగా సాధించిన పురోగ‌తికి ఈ పుస్త‌కం నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ప‌ల్లెల‌ను ఆధునీక‌రించుకుంటూ, ప‌ల్లెల పున‌ర్నిర్మాణం జ‌రుగుతున్న‌ద‌ని చెప్పారు. ర‌చ‌యిత గౌరీ శంక‌ర్‌ను మంత్రి అభినందించారు.

Updated Date - 2022-01-10T23:03:32+05:30 IST