కేసీఆర్ ధర్నాతో మోదీ కళ్లు తెరిచారు: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-11-19T22:27:51+05:30 IST

రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లో ధర్నా చేస్తే ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కళ్లు తెరిచారని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

కేసీఆర్ ధర్నాతో మోదీ కళ్లు తెరిచారు: ఎర్రబెల్లి

వరంగల్: రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లో ధర్నా చేస్తే ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కళ్లు తెరిచారని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న నేపద్యంలో మంత్రి ఎర్రబెల్లి శుక్రవారం వరంగల్ లో మీడియాతో మాట్లాడారు. రైతుల ప్రయోజనాలు పట్టని మోదీ కేసీఆర్ ధర్నాతో దిగివచ్చారని అన్నారు.కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తారని మోదీ భయపడి చట్టాలు ఉపసంహరించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఇప్పటికైనా నిజం తెలుసుకున్నందుకు ధన్యవాదాలని అన్నారు. ధాన్యం కొనుగోలు చేయొద్దనేదే కొత్త చట్టాల ఉద్దేశం. ప్రతీగింజ కొంటాం అని కేంద్రం లెటర్ ఇచ్చే వరకు వదిలిపెట్టమని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-11-19T22:27:51+05:30 IST