వ్యక్తిత్వ వికాసం...సమాజ వికాసానికి చదువు దోహదం: Errabelli

ABN , First Publish Date - 2022-06-20T20:34:17+05:30 IST

చదువు వ్యక్తిత్వ వికాసానికి, సమాజ వికాసానికి దోహదం చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) అన్నారు.

వ్యక్తిత్వ వికాసం...సమాజ వికాసానికి చదువు దోహదం: Errabelli

మహబూబాబాద్: చదువు వ్యక్తిత్వ వికాసానికి, సమాజ వికాసానికి దోహదం చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) అన్నారు. సామాజిక గౌరవాన్ని కలిగించే చదువు(education) ఒక్కటే మనిషిని సమున్నతంగా తీర్చిదిద్దుతుందని కాబట్టిఅందరూ బాగా చదువుకోవాలని చెప్పారు.మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు లోని అంబేద్కర్ కాలనీ లో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు అక్షరాలు దిద్దించారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ విద్ అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. 


అన్నివర్గాలు  బాగా అభివృద్ధిలోకి రావాలన్నారు.సీఎం కేసిఆర్ కూడా తెలంగాణలో విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.మన ఊరు మన బడి కింద 7,289 కోట్ల తో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు పెంచుతున్నామని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమం లోకి మారుస్తున్నామన్నారు.అనేక ఆశ్రమ పాఠశాలలు పెట్టీ ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు.ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్ ఇప్పిస్తున్నామన్నారు.విదేశీ విద్య కోసం ప్రత్యేక పథకం పెట్టీ పేద విద్యార్థులను చదివిస్తున్నామని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాలనీ వాసులు, పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-20T20:34:17+05:30 IST