కాంగ్రెస్, టీడీపీలను నమ్మకండి- ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2020-11-29T20:12:22+05:30 IST
కాంగ్రెస్, టీడీపీలను నమ్మొద్దని, వారు ఎన్నికలప్పుడు మాత్రమే వస్తారని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీలను నమ్మొద్దని, వారు ఎన్నికలప్పుడు మాత్రమే వస్తారని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేవలం ఎన్నికల సమయంలో ప్రజల ఓట్లతో గెలవాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్, టీడీపీలు ఉన్నాయన్నారు. కానీ టీఆర్ఎస్ మాత్రం ఎన్నికలకు సంబంధం లేకుండా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. జీహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్పేట్ హౌసింగ్బోర్డు కాలనీలో పలు సమావేశాలు, ర్యాలీలు జరిగాయి. ఆయా కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు.
హౌసింగ్బోర్డు కాలనీలోని పార్టీ కార్యాలయంలో దర్జీ, కుర్మ సంఘం, వెంకటేశ్వరానగర్లో ముదిరాజ్ సంఘం ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ , కేటీఆర్లు హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. అతి త్వరలో ఉప్పల్ నియోజక వర్గం పరిధిలో కొత్తగా 5 ఐటీ పార్కులకు శంకుస్ధాపన చేయనున్నట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు.