బైక్‌ ర్యాలీతో మంత్రి ఎర్రబెల్లి ప్రచారం

ABN , First Publish Date - 2020-11-29T21:16:36+05:30 IST

ఎన్నికల ప్రచార సమయం ముగింపుకు చేరుకోవడంతో టీఆర్‌ఎస్‌ నేతలు సుడిగాలి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

బైక్‌ ర్యాలీతో మంత్రి ఎర్రబెల్లి ప్రచారం

హైదరాబాద్‌: ఎన్నికల ప్రచార సమయం ముగింపుకు చేరుకోవడంతో టీఆర్‌ఎస్‌ నేతలు సుడిగాలి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈమేరకు రాష్ట్రపంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఇన్‌ఛార్జిగా ఉన్న మీర్‌పేట డివిజన్‌లో భారీఎత్తున బైక్‌ర్యాలీతో ప్రచారాన్ని నిర్వహించారు. ర్యాలీలో ముందు వరసలో బైక్‌పై వెళుతూ ప్రజలకు అభివాదం చేశారు. ర్యాలీలో డివిజన్‌వ్యాప్తంగా బైక్‌పై ప్రయాణించారు. అభ్యర్థితో పాటు భారీగా బైకులపై యువకులు ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పధకాలు ఈ ఎన్నికల్లో పార్టీ విజయానికి దోహదపడతాయని మంత్రి ఎర్రబెల్లిపేర్కొన్నారు. 


Updated Date - 2020-11-29T21:16:36+05:30 IST