AP News: కొద్దిరోజులుగా వైసీపీపై వ్యతిరేక ప్రచారం జరుగుతోంది: ధర్మాన
ABN , First Publish Date - 2022-08-11T17:01:21+05:30 IST
గత కొద్దిరోజులుగా వైసీపీ మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు.
శ్రీకాకుళం: గత కొద్దిరోజులుగా వైసీపీ మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు (Dharmana prasad rao) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధి అంశాన్ని మొత్తం వైస్సార్సీపీ(YSRCP)కి అంటగడుతున్నారని మండిపడ్డారు. వైస్సార్సీపీ మహిళలకు కీడు చేస్తుందని టీడీపీ (TDP) ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కుయోక్తులతో ఎదుటి పార్టీని పడగొట్టడం చంద్రబాబు (Chandrababu) నైజమన్నారు. సీఎం జగన్ (Jagan mohan reddy) తన కెబినెట్లో ఎన్నడూ లేనంతమంది మహిళలను తీసుకున్నారని తెలిపారు. చంద్రబాబు మహిళా రుణగ్రస్తులను మోసం చేస్తే.. సీఎం జగన్ (CM Jagan) వచ్చి వాళ్లకి రుణ విముక్తులను చేశారని అన్నారు. దిశా లాంటి చట్టాలను చేసి మహిళలకు రక్షణ కల్పిస్తుంటే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చెప్పడానికి ఎలాంటి అంశాలు లేకపోవడం వలన ఇలాంటి అనవసర యాగీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సమాజంలో సిగ్గుమాలిన పని ఎవరు చేసినా అది ఉపేక్షించేది కాదని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.