టీడీపీ హయంలో 2.57,5099 కోట్ల అప్పు: మంత్రి బుగ్గన

ABN , First Publish Date - 2021-09-05T00:49:18+05:30 IST

గత టీడీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన

టీడీపీ హయంలో 2.57,5099 కోట్ల అప్పు: మంత్రి బుగ్గన

అమరావతి: గత టీడీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రయత్నం చేశారు. టీడీపీ హయంలో అప్పును 2.57,5099 కోట్లకు పెంచినట్టు బుగ్గన ప్రకటనలో పేర్కొన్నారు. టీడీపీ సర్కార్ వల్ల అప్పు భారీగా పెరిగిందని మంత్రి చూపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అప్పు తీసేస్తే టీడీపీ 5ఏళ్లలో చేసిన అప్పు 1,26,885కోట్లు మాత్రమే. వైసీపీ గత 27 నెలల వ్యవధిలో అధికారికంగా చేసిన అప్పు 1,27,105కోట్లు. అయితే అప్పుల వివరాలను పత్రికా ప్రకటనలో మంత్రి బుగ్గన ప్రస్తావించలేదు.  

Updated Date - 2021-09-05T00:49:18+05:30 IST