మేకపాటి గౌతమ్ హఠాన్మరణంపై మంత్రి బొత్స దిగ్భ్రాంతి
ABN , First Publish Date - 2022-02-21T15:39:18+05:30 IST
మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణంపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమరావతి: మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణంపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చివరి నిముషం వరకు రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడిన సహచరుడిని కోల్పోవడం అత్యంత బాధాకరంగా ఉందన్నారు. ఆయన కుటంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రార్థించారు.