ఎన్నికల్లో వైసీపీ చరిత్ర సృష్టించింది: మంత్రి బొత్స

ABN , First Publish Date - 2021-03-14T21:23:28+05:30 IST

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ చరిత్ర సృష్టించిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

ఎన్నికల్లో వైసీపీ చరిత్ర సృష్టించింది: మంత్రి బొత్స

విజయనగరం: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ చరిత్ర సృష్టించిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కనుచూపు మేరలో కనిపించలేదన్నారు.  వైసీపీ పనితీరుకు ఈ తీర్పు అద్దంపడుతోందని బొత్స వ్యాఖ్యానించారు. అభివృద్ధి, సంక్షేమమే తమను గెలిపించిందన్నారు. వలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటిముందుకే సంక్షేమ పథకాలు వస్తాయని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో 11 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల కౌంటంగ్‌లో 6 కార్పొరేషన్లను వైసీపీ దక్కించుకుంది. చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, గుంటూరు, ఒంగోలు. మొత్తంగా చూస్తే అటు మున్సిపాలిటీలు, ఇటు కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అత్యధిక స్థానాలు దక్కించుకుంది. మేజర్ ఫలితాలన్నింటిని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వైజాగ్, విజయవాడ కార్పొరేషన్లలో కూడా మేజర్ స్థానాల్లో వైసీపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. 

Updated Date - 2021-03-14T21:23:28+05:30 IST