చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారు: మంత్రి బొత్స
ABN , First Publish Date - 2021-10-20T19:18:34+05:30 IST
టీడీపీని నిషేధించాలని ఈసీని కోరుతామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు.
విజయనగరం: టీడీపీని నిషేధించాలని ఈసీని కోరుతామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు. నేడు బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీడీపీ నేతల భాషను పవన్, బీజేపీ నేతలు ఎందుకు ఖండించడం లేదు? టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి. చంద్రబాబు, పవన్ కలిసి ప్లాన్ ప్రకారమే రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తున్నారు. చంద్రబాబు బేషరుతుగా క్షమాపణ చెప్పాలి. మావోయిస్ట్ పార్టీకి టీడీపీకి తేడా లేదు. చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడిన భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. చంద్రబాబు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.