మంత్రి వర్గం మారుతుందని ఎప్పుడో చెప్పా: మంత్రి బాలినేని

ABN , First Publish Date - 2022-03-12T17:46:07+05:30 IST

కొత్త మంత్రి వర్గం ఏర్పాటు సీఎం జగన్ నిర్ణయమని...సీఎం ఎవరిని పెడితే వాళ్లే మంత్రిగా ఉంటారని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

మంత్రి వర్గం మారుతుందని ఎప్పుడో చెప్పా: మంత్రి బాలినేని

ఒంగోలు: కొత్త మంత్రి వర్గం ఏర్పాటు సీఎం జగన్ నిర్ణయమని... సీఎం ఎవరిని పెడితే వాళ్లే మంత్రిగా ఉంటారని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంత్రి వర్గం మారుతుందని ఆరు నెలల క్రితమే  చెప్పానని,  ఎవరిని ఉంచాలో ఎవరిని తీసివేయాలో ముఖ్యమంత్రి ఇష్టమని తెలిపారు. ఐదేళ్లు పరిపాలించడానికి తమకు ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు. ముందస్తు ఎన్నికలకు రమ్మని చెప్పడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో 20 సీట్లు చంద్రబాబు గెలిచారని... వచ్చే ఎన్నికల్లో ఆ 20 సీట్లు గెలుచుకుంటే చాలని వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో జగన్ అసెంబ్లీని బాయికట్ చేసి వెళ్లి సీఎం అయ్యారని, చంద్రబాబు కూడా అసెంబ్లీని బాయికట్ చేసి వెళ్లి ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటున్నారని మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారు. 

Updated Date - 2022-03-12T17:46:07+05:30 IST