బంపర్ ఆఫర్ ప్రకటించిన హైదరాబాద్ మెట్రో
ABN , First Publish Date - 2020-11-01T11:47:54+05:30 IST
మెట్రో తన ప్రయాణికులకు క్యాష్ బ్యాక్ ఆఫర్ను ప్రకటించింది. నేటి నుంచి మెట్రో స్మార్ట్కార్డులు వినియోగించే ప్రతి ఒక్కరికి రూ. 1,500 రీచార్జీపై అదనంగా రూ.600 క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నారు.
హైదరాబాద్ : మెట్రో తన ప్రయాణికులకు క్యాష్ బ్యాక్ ఆఫర్ను ప్రకటించింది. నేటి నుంచి మెట్రో స్మార్ట్కార్డులు వినియోగించే ప్రతి ఒక్కరికి రూ. 1,500 రీచార్జీపై అదనంగా రూ.600 క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నారు. మొత్తంగా స్మార్ట్ కార్డుదారుడికి రూ.2,100 వస్తుండగా, ప్రతి ప్రయాణంలో 10శాతం తగ్గింపును పొందుతాడు. స్టేషన్లలోని స్మార్ట్కార్డు రీచార్జీల్లో, ఆన్లైన్లో ఆఫర్ పొందే అవకాశముంది. 90 రోజుల్లో టాప్-అప్ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు.