‘మేరా జహా’ ఆవిష్కరణ సభ
ABN , First Publish Date - 2021-10-10T05:33:41+05:30 IST
డా. షాజహానా రచించిన తొలి ముస్లిం స్ర్తీ నవల ‘మేరా జహా’ ఆవిష్కరణ సభ అక్టోబర్ 10 ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరుగుతుంది...
డా. షాజహానా రచించిన తొలి ముస్లిం స్ర్తీ నవల ‘మేరా జహా’ ఆవిష్కరణ సభ అక్టోబర్ 10 ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరుగుతుంది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జరిగే ఈ సభలో ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కవి, కథకులు, విమర్శకులు పసునూరి రవీందర్ సభకు అధ్యక్షత వహిస్తారు. రిటైర్డ్ ప్రొఫెసర్ సూసీతారు నవలను ఆవిష్కరిస్తారు. తొలి ప్రతులను దిలావర్, యాకూబ్ స్వీకరిస్తారు. నవలాకారులు ముదిగంటి సుజాతారెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆత్మీయ అతిథులుగా పాల్గొంటారు. ఈ సభలో కవులు మెర్సీ మార్గరెట్, కోడూరి విజయకుమార్, నస్రీన్ఖాన్, కథకులు ఇనాయతుల్లా ప్రసంగిస్తారు.
‘అంకుర్’ ముస్లిం రచయిత్రుల వేదిక
‘హర్యాలీ’ ముస్లిం రచయితల వేదిక