నేడు కేబినెట్ భేటీ
ABN , First Publish Date - 2022-03-06T16:04:00+05:30 IST
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నేడు కేబినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నేడు కేబినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 2022-23 బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉందని ప్రగతిభవన్ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సారి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. బడ్జెట్ ఆమోదంపై మార్చి 6న ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. మార్చి 7న ఆర్థికమంత్రి హరీష్రావు బడ్జెట్ ప్రవేశపెడతారు. సభ ఎన్నిరోజులు జరగాలనేది బీఏపీ సమావేశంలో నిర్ణయిస్తారు.