మెడికల్ పీజీ పరీక్షలు వాయిదా
ABN , First Publish Date - 2020-03-27T09:04:14+05:30 IST
కరోనా నేపథ్యంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించాల్సిన పీజీ, డిప్లొమా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ...
అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించాల్సిన పీజీ, డిప్లొమా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ పరీక్షల విభాగాధిపతి ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 28 నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి తదుపరి షెడ్యూల్ను మళ్లీ విడుదల చేస్తామని చెప్పారు.