మేడారంలో కొనసాగుతున్న మొక్కులు

ABN , First Publish Date - 2022-02-21T01:21:41+05:30 IST

ములుగు జిల్లా మేడారంలో మొక్కులు ఇంకా కొనసాగుతున్నాయి. మహాజాతర శనివారం ముగిసినప్పటికీ భక్తులు వనదేవతలను దర్శించుకోవడానికి భారీ

మేడారంలో కొనసాగుతున్న మొక్కులు

మేడారం: ములుగు జిల్లా మేడారంలో మొక్కులు ఇంకా కొనసాగుతున్నాయి. మహాజాతర శనివారం ముగిసినప్పటికీ భక్తులు వనదేవతలను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆ పరిసరాల్లో ఆదివారం సందడి కనిపించింది. జంపన్నవాగులో స్నానాలు ఆచరించిన భక్తులు గద్దెల వద్దకు చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తల్లులకు చీరె, సారె, కొబ్బరికాయలు, బెల్లం, పసుపు, కుంకుమ సమర్పించుకున్నారు. మేడారంలోనే ఉన్న ఎమ్మెల్యే సీతక్క అక్కడి పరిస రాలను పరిశీలించారు. జాతర ముగిసిన అనంతరం తరలివచ్చిన భక్తులకు మంచెపై నుంచి మైక్‌ ద్వారా పలు జాగ్రత్తలు చెప్పారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అనౌన్స్‌మెంట్‌ ద్వారా తప్పిన పోయిన వారి సమాచారాన్ని ఇచ్చారు. జాత రలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పారిశుధ్య సిబ్బంది శుభ్రం చేశారు. అలాగే భక్తుల కోసం వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన శిబిరం ఆదివారం కూడా కొనసాగింది. 

Updated Date - 2022-02-21T01:21:41+05:30 IST