Medak: మంత్రాలు చేస్తున్నాడంటూ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పు

ABN , First Publish Date - 2022-06-04T17:46:06+05:30 IST

జిల్లాలోని నిజాంపేట్ మండలం చల్మెడ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.

Medak: మంత్రాలు చేస్తున్నాడంటూ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పు

మెదక్: జిల్లాలోని నిజాంపేట్ మండలం చల్మెడ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో  శాల సుదర్శన్ అనే వ్యక్తిపై కొందరు దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. సకాలంలో స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ప్రమాదం తప్పింది. బాధితుడికి గాయాలవడంతో రామాయపెట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-04T17:46:06+05:30 IST