పది మంది మహిళా గిరిజన రైతుల అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-10-20T05:29:33+05:30 IST

పది మంది మహిళా గిరిజన రైతుల అరెస్ట్‌

పది మంది మహిళా గిరిజన రైతుల అరెస్ట్‌

మహబూబాబాద్‌ రూరల్‌, అక్టోబరు 19 : జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న మెడికల్‌ కళాశాల పనులను అడ్డుకుని అధికారుల విధులకు ఆటంకం కలిగించిన, జిల్లా ఆస్పత్రిలో ట్యాంక్‌ ఎక్కిన కేసులో సాంక్రియ తండా, బాబునాయక్‌ తండాలకు చెందిన పది మంది మహిళా గిరిజన రైతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టౌన్‌ సీఐ జూపల్లి వెంకటరత్నం మంగళవారం తెలిపారు. ఈ నెల 18న జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీ సమీపంలో అధికారులు మెడికల్‌ కళాశాల కోసం కేటాయించిన స్థలంలో పనులు జరుగుతుండగా ఆ భూమి తమదేనంటూ కొంతమంది గిరిజన మహిళా రైతులు అడ్డుకుని పనులకు విఘాతం కలిగించడం, మరికొంతమంది జిల్లా ఆస్పత్రిలోని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి దాదాపు ఆరు గంటల పాటు ఆందోళన చేపట్టారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో 19 మందిపై కేసు నమోదు చేసి పది మందిని అరెస్టు చేశామని, మరో తొమ్మిదిమంది పరారీలో ఉన్నారని సీఐ చెప్పారు. 

Updated Date - 2021-10-20T05:29:33+05:30 IST