బాలిక మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2021-04-16T05:30:00+05:30 IST
బాలిక మృతదేహం లభ్యం
మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే శంకర్నాయక్ పరామర్శ
చిన్నారుల మృతితో జమాండ్లపల్లిలో విషాదం..
మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు జమాండ్లపల్లి గ్రామంలో ఇద్దరు చిన్నారుల మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎదురెదురు ఇండ్లలో ఉండే పదేళ్ల వయస్సుగల చిన్నారులు యశ్వంత్, సాయిసహాస్త్రలు ఆడుకునేందుకు వెళ్లి కొద్ది గంటల్లోనే కానరాని లోకానికి వెళ్లడం గ్రామస్థులను కలచివేసింది. ఇరువురు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి మున్నేరువాగులో పడి విఘత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.