మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొప్పుల
ABN , First Publish Date - 2020-04-05T22:59:12+05:30 IST
జిల్లాలోని గొల్లపల్లి మండంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నెలకొల్పిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు.
జగిత్యాల: జిల్లాలోని గొల్లపల్లి మండంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నెలకొల్పిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో 23,214 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగిందన్నారు. తద్వారా 5,72,00 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వచ్చిందని మంత్రి తెలిపారు. కాగా జిల్లాలో 378 మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు ఆయన వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యల తీసుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, ఎంపిపి నక్కశంకర్, జడ్పీటీసీ గొస్కుల జలేందర్, గొల్లపల్లి పీఎసీఎస్ ఛైర్మన్ రాజ్సుమన్ తదతరులు పాల్గొన్నారు.