11కిలోల భారీ కణితి తొలగింపు!
ABN , First Publish Date - 2020-05-31T09:09:05+05:30 IST
రమేష్ సంఘమిత్ర హాస్పిటల్లో అరుదైన శస్త్రచికి త్స నిర్వహించారు. ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి(35) తీవ్రమైన కడుపునొప్పితో ఒంగోలులోని రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ లో చేరారు. అతనికి పరీక్షలు నిర్వహించిన ప్రముఖ సర్జికల్
- లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి డాక్టర్ కార్తీక్బాబు
అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): రమేష్ సంఘమిత్ర హాస్పిటల్లో అరుదైన శస్త్రచికి త్స నిర్వహించారు. ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి(35) తీవ్రమైన కడుపునొప్పితో ఒంగోలులోని రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ లో చేరారు. అతనికి పరీక్షలు నిర్వహించిన ప్రముఖ సర్జికల్ గ్యాస్టోఎంటారాలజిస్టు డాక్టర్ కార్తీక్బాబు పెరుమాళ్ల చిన్నపే గు వద్ద భారీ కణితి ఉన్నట్లు గుర్తించారు. బయాప్సీ అనంతరం దానిని ‘మాంటెల్ సెల్ లింఫోమా’గా నిర్ధారించారు. రోగికి వెంటనే శస్త్రచికిత్స చేసి దాదాపు 11కిలోల భారీ కణితిని తొలగించారు. అరుదైన రికార్డు సాధించిన కార్తీక్బాబు పేరు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయింది.