గుంటూరులో భారీగా తెలంగాణ మద్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-09-18T00:02:08+05:30 IST
నగరంలో భారీగా తెలంగాణ మద్యాన్ని సెబ్ పోలీసులు పట్టుకున్నారు. గుజ్జనగుండ్లలో అక్రమంగా నిల్వ ఉంచిన 1428 మద్యం బాటిల్స్, ...
గుంటూరు: నగరంలో భారీగా తెలంగాణ మద్యాన్ని సెబ్ పోలీసులు పట్టుకున్నారు. గుజ్జనగుండ్లలో అక్రమంగా నిల్వ ఉంచిన 1428 మద్యం బాటిల్స్, సుమారు 17 లక్షల విలువైన మద్యం పోలీసులు సీజ్ చేశారు. మద్యం తరలిస్తున్న నిందితులలో ముగ్గురిని నర్రా అశోక్ , చెన్నారెడ్డి ,వెంకటరమణలను పోలీసులు అరెస్ట్ చేశారు. జేకేసి కాలేజి ఉద్యోగి మేడా సంపత్ పరారీలో ఉన్నాడు. నిందితుల వివరాలను ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ మీడియాకు వెల్లడించారు.