పెళ్లి చేసుకుంటానని బాలికను తీసుకెళ్లిన వ్యక్తిపై పోక్సో కేసు
ABN , First Publish Date - 2021-03-21T19:24:45+05:30 IST
పెళ్లి చేసుకుంటానని ఓ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన వ్యక్తిపై పోక్సో చట్టం...
హైదరాబాద్ /అడ్డగుట్ట : పెళ్లి చేసుకుంటానని ఓ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన వ్యక్తిపై పోక్సో చట్టం కింద గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై సాయిఈశ్వర్గౌడ్ కథనం ప్రకారం.. సికింద్రాబాద్కు చెందిన బాలిక(17) ఓ ప్రైవేట్ ఆఫీ్సలో పనిచేస్తోంది. నల్గొండ జిల్లా తిరుమలగిరి గ్రామానికి చెందిన జాన్సన్ పెయింటర్. మూడేళ్ల నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ పరిచయం కాస్తా పెళ్లి వరకు వచ్చింది. అతడు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. బాలికకు పెళ్లి వయస్సు రాగానే పెళ్లి చేద్దామని కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్న సమయంలో జాన్సన్ నేరుగా ఇంటికి వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
ఈ నెల 17న బాలిక ఆఫీస్కు వచ్చింది. అక్కడి నుంచే జాన్సన్ ఆ బాలికను తీసుకుని తిరుమలగిరి గ్రామానికి వెళ్లాడు. ఆ రోజు ఇంటికి బాలిక రాకపోవడంతో తల్లిదండ్రులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక జాన్సన్ ఇంట్లో తిరుమలగిరిలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. బాలికను సికింద్రాబాద్కు తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. జాన్సన్పై పోక్సో చట్టం కింద నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.