మార్కెట్లలో ఒమైక్రాన్ భయాలు
ABN , First Publish Date - 2021-12-04T06:13:56+05:30 IST
కర్ణాటకలో తొలిసారిగా రెండు ఒమైక్రాన్ కేసులు నమోదు కావడం శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లను వణికించింది....
సెన్సెక్స్ 765 పాయింట్లు పతనం
ముంబై: కర్ణాటకలో తొలిసారిగా రెండు ఒమైక్రాన్ కేసులు నమోదు కావడం శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లను వణికించింది. దీంతో వరుసగా 2 రోజులుగా ర్యాలీ కనబరిచిన మార్కెట్లు శుక్రవారం భారీగా పతనమయ్యాయి. బీఎ్సఈ సెన్సెక్స్ ఏకంగా 764.83 పాయింట్లు నష్టపోయి 57,696.46 పాయింట్ల దగ్గర క్లోజైంది. నిఫ్టీ కూడా 204.95 పాయింట్ల నష్టంతో 17,196.70 వద్ద ముగిసింది. వారం మొత్తంలో సెన్సె క్స్ 589.31పాయింట్లు, నిఫ్టీ 170.25పాయింట్లు లాభపడ్డాయి.