హైదరాబాద్‌లో వన్‌ప్లస్‌ స్మార్ట్‌ టీవీల తయారీ

ABN , First Publish Date - 2021-07-25T06:12:04+05:30 IST

భారత్‌లో స్మార్ట్‌ టెలివిజన్ల తయారీకి వన్‌ప్లస్‌ హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చుకుంటోంది.

హైదరాబాద్‌లో వన్‌ప్లస్‌ స్మార్ట్‌ టీవీల తయారీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): భారత్‌లో స్మార్ట్‌ టెలివిజన్ల తయారీకి వన్‌ప్లస్‌ హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చుకుంటోంది. వన్‌ప్లస్‌ స్మార్ట్‌ టీవీల శ్రేణిని హైదరాబాద్‌కు చెందిన రేడియంట్‌ అప్లయెన్స్‌ అండ్‌ ఎలక్ర్టానిక్స్‌ తయారు చేస్తోంది. ఇక్కడ తయారైన స్మార్ట్‌ టీవీలను వన్‌ప్లస్‌ దేశవ్యాప్తంగా సరఫరా చేయనుంది. స్మార్ట్‌ టీవీల ఉత్పత్తికి వన్‌ప్ల్‌సతో గత ఏడాది రేడియంట్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకూ 5 లక్షల టీవీలను ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది చివరి నాటికి 10 లక్షల టీవీలను ఉత్పత్తి చేయనున్నట్లు రేడియంట్‌ తెలిపింది. గతంలో స్మార్ట్‌ టీవీలను వన్‌ప్లస్‌ దిగుమతి చేసుకునేది. సామ్‌సంగ్‌, షామీ కంపెనీలకు కూడా  రేడియంట్‌ టీవీలను తయారు చేస్తోంది. హైదరాబాద్‌ నుంచి స్మార్ట్‌ టీవీలను దేశ వ్యాప్తంగా సరఫరా చేయడానికి వన్‌ప్లస్‌ నిర్ణయించడంపై తెలంగాణ పరిశ్రమల మంత్రి కే తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-07-25T06:12:04+05:30 IST